What Does the Bible Say About Women Pastors

స్త్రీ పాస్టర్ల గురించి బైబిల్ ఏమి చెబుతుంది?

23/06/2026
Why Reformed Soteriology Matters

సంస్కరించబడిన విమోచనశాస్త్రం ఎందుకు ముఖ్యమైనది

30/06/2026
What Does the Bible Say About Women Pastors

స్త్రీ పాస్టర్ల గురించి బైబిల్ ఏమి చెబుతుంది?

23/06/2026
Why Reformed Soteriology Matters

సంస్కరించబడిన విమోచనశాస్త్రం ఎందుకు ముఖ్యమైనది

30/06/2026

లేఖనాలలో రక్షణ

Salvation in Scripture

బైబిల్ భూమ్యాకాశముల సృష్టితో ప్రారంభమై (ఆదికాండము 1–2), నూతన ఆకాశం మరియు నూతన భూమి యొక్క సృష్టితో ముగుస్తుంది (ప్రకటన 21–22). సృష్టి మరియు నూతన సృష్టి అనేవి లేఖనాల్లోని విమోచన చరిత్రకు సంబంధించిన సమస్త అంశాలకు ఒక చట్రంలా నిలిచి, వాటిని దేవుని కేంద్రంగా చేసుకున్న సరైన సందర్భంలో ఉంచుతాయి. మరో మాటలో చెప్పాలంటే, మానవ విమోచన అనేది అంతిమ లక్ష్యం కాదు; అది ఆ లక్ష్యానికి ముందుండే ఒక దశ మాత్రమే. లేఖనాలు మానవ కేంద్రితమైనవి కావు; అవి దేవుని కేంద్రితమైనవి. దేవుడు మరియు ఆయన మహిమే అంతిమ లక్ష్యం. మానవ విమోచన ఆ అంతిమ లక్ష్య సాధనకు తోడ్పడుతుంది.

ఆదికాండములోని ఆరు రోజుల సృష్టి యొక్క పరాకాష్ట, దేవుడు ఆదాము మరియు హవ్వలను సృష్టించడమే. కానీ మానవుడు తనంతట తనలో ఒక అంతం కాదు. మానవుడు తన సృష్టికర్తను ఆరాధించడానికి సృష్టించబడ్డాడని ఏడవ రోజు సూచిస్తుంది. దేవుడు మొదటి మానవునితో ఒక నిబంధన చేసాడు, దానిని సాధారణంగా క్రియల నిబంధన అని పిలుస్తారు. ఈ నిబంధనలో, “సంపూర్ణమైన మరియు వ్యక్తిగత విధేయత అనే షరతుపై, ఆదాముకు మరియు అతని ద్వారా తన సంతతికి జీవము వాగ్దానం చేయబడింది” (వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస ఒప్పుకోలు 7.2). విచారకరంగా, ఆదాము మరియు హవ్వ తమ ప్రేమగల సృష్టికర్త మాట కంటే సర్పము మాటను స్వీకరించడానికి ఎంచుకున్నారు. వారు దేవునికి విరోధంగా పాపం చేసి, క్రియల నిబంధన ద్వారా నిత్యజీవాన్ని పొందలేనివారయ్యారు (ఆదికాండము 3). ఇదే పూర్తి దిక్కుతోచని స్థితిలో వారి వారసులు కూడా జన్మిస్తారు.

లేఖనాల్లో రక్షణ కథ, ఆదాము పాపంలో పడిన వెంటనే ప్రారంభమవుతుంది. ఆదాము, హవ్వలను తనతో శాశ్వతమైన శత్రుత్వంలో వదిలివేయకుండా, దేవుడు సర్పంతో, “నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును మధ్య వైరము కలుగజేసెదను” అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఈ అద్భుతమైన వాగ్దానాన్ని జతచేశాడు: “అతడు నిన్ను తలమీద కొట్టును; నీవు అతని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.” (ఆదికాండము 3:15). ఇది సర్పముపై దేవుడు చేసిన యుద్ధ ప్రకటన, మరియు ఇది ఆదాము, హవ్వలకు ఆయన చూపిన కృపా ప్రకటన కూడా. ఈ సమయం నుండి మనం చదివేదంతా, దేవుడు ఈ ప్రారంభ వాగ్దానాలను అంతిమంగా నెరవేర్చడానికి చేస్తున్న కార్యమే.

మొదటిలో మానవులు అవినీతి మరియు పాపంలో మరింత లోతుగా కూరుకుపోగా, దేవుడు జలప్రళయం ద్వారా లోకానికి తీర్పు తీరుస్తాడు (ఆదికాండము 6–9). మిగిలిన కొద్దిమంది కూడా పాపంలోనే కొనసాగగా, దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని భూమి అంతటా చెదరగొడతాడు (ఆదికాండము 11). అయితే, ఆ తర్వాత దేవుడు అబ్రామును పిలిచి అతనితో ఒక నిబంధన చేసుకుంటాడు. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాలలో ఇవి ఉన్నాయి:

నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడును. (ఆదికాండము 12:2-3, నొక్కి చెప్పబడింది) 

అబ్రాహాము కుమారుని ద్వారానే మానవ రక్షణ కార్యం నెరవేర్చబడుతుంది.

చివరికి, అబ్రాహాము సంతతివారు ఐగుప్తులో బానిసలుగా చేయబడ్డారు. అక్కడ వారు అనేకమంది జనులుగా వృద్ధి చెందారు (నిర్గమకాండము 1:7). నాలుగు వందల సంవత్సరాల తర్వాత, దేవుడు తాను చేయబోయే పని గురించి మోషేకు తెలియజేసి, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పమని అతనికి ఆజ్ఞాపించాడు:

కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము. నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు. నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా. (నిర్గమకాండము 6:6-8, నొక్కి చెప్పబడింది)

“నేను మిమ్మల్ని బయటకు రప్పిస్తాను, మరియు నేను మిమ్మల్ని లోపలికి రప్పిస్తాను.” పాత నిబంధనలోని తన ఆదర్శప్రాయమైన విమోచన కార్యంలో దేవుడు చేసేది ఇదే. తరువాత ప్రవక్తలు భవిష్యత్తులో జరగబోయే, మరింత గొప్ప విమోచన కార్యం గురించి మాట్లాడినప్పుడు, దానిని నిర్గమకాండ పరిభాషను ఉపయోగించి వర్ణించడం జరుగుతుంది.

ఐగుప్తు నుండి ప్రజల నిర్గమన సమయంలో, దేవుడు తన ప్రజలకు తన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి, వాగ్దానపు దేశంలో రాబోయే రాజ్యానికి పునాది వేస్తాడు. అయితే, రాజుల మరియు ప్రజల పాపాల కారణంగా ఆ రాజ్యం నిలవదు. దేవుడు ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరిస్తాడు, కానీ వారు పశ్చాత్తాపపడటానికి నిరాకరించడంతో చెరలోకి పంపబడతారు. రాబోయే తీర్పు గురించి ప్రవక్తలు చేసిన హెచ్చరికలే అంతిమ విషయం కాదు. తీర్పు తర్వాత, మొదటి నిర్గమన కంటే గొప్పదైన విమోచన కార్యాన్ని చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆయన తన ప్రజలను రక్షించడానికి ఒక మెస్సయ్య  అయిన రాజును పంపుతాడు. ఆయన ఒక నూతన నిబంధనను స్థాపించి, నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టిస్తాడు.

వందల సంవత్సరాల తర్వాత, ఇశ్రాయేలులోని ఒక యువతికి దేవదూత ప్రత్యక్షమై, ఆమె కుమారుడే ఆ వాగ్దానం చేయబడిన మెస్సయ్య అయిన రాజు అని ఆమెకు తెలియజేశాడు (లూకా 1:26–33). ఆయన పేరు యేసు, ఎందుకంటే “ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును” (మత్తయి 1:21). సర్పము యొక్క తలను చితకొట్టడానికి వచ్చినవాడు యేసే. ఆయన అబ్రాహాము కుమారుడు; ఆయన ద్వారానే సమస్త జనములు ఆశీర్వదించబడతాయి (మత్తయి 1:1). మన అతిక్రమముల నిమిత్తం గాయపరచబడినవాడు మరియు మన దోషముల నిమిత్తం నలగగొట్టబడినవాడు అయిన ఆ వాగ్దత్త ‘బాధలు అనుభవించే సేవకుడు’ ఆయనే (యెషయా 53:5). ఆయన మన పాపముల కొరకు మరణించాడు (1 కొరింథీయులకు 15:3), ఆయన యందు విశ్వాసముంచిన వారు రక్షించబడతారు (యోహాను 3:16; అపొస్తలుల కార్యములు 16:31).

రెండవ ఆదాము నూతన మానవాళికి శిరస్సుగా ఉన్నారు, మరియు ఆ గొప్ప నిర్గమనంలో, ఆయన తన ప్రజలను పాపం మరియు చీకటి నుండి బయటకు తీసుకువచ్చి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో ఐక్యత మరియు సహవాసంలో ఉండటానికి, మరియు దేవుణ్ణి నిరంతరం ఆనందించడానికి వారిని తన రాజ్యంలోకి తీసుకువస్తారు. యేసు క్రీస్తు యొక్క రక్షణ కార్యం మరియు దానిని ఆయన ప్రజలకు వర్తింపజేయడం అనేది లేఖనాలలో అత్యంత మహిమాన్వితమైన సిద్ధాంతాలలో ఒకటి. ఈ వ్యాసాల శ్రేణిలో, రక్షణకు సంబంధించిన బైబిలు సిద్ధాంతాన్ని సంఘం ఎలా అర్థం చేసుకుందో (మరియు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుందో) మనం పరిశీలిస్తాము మరియు ఈ సిద్ధాంతం యొక్క సరైన అవగాహన మన క్రైస్తవ జీవితానికి ఎందుకు అంత ముఖ్యమో వివరించడానికి ప్రయత్నిస్తాము.యు కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకుందో) మనం పరిశీలిస్తాము మరియు ఈ సిద్ధాంతం యొక్క సరైన అవగాహన మన క్రైస్తవ జీవితానికి ఎందుకు అంత ముఖ్యమో వివరించడానికి ప్రయత్నిస్తాము.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.

కీత్ మాథిసన్

కీత్ మాథిసన్

డాక్టర్ కీత్ మాథిసన్ గారు ఫ్లోరిడా రాష్ట్రంలోని శాన్‌ఫోర్డ్‌లో ఉన్న రిఫర్మేషన్ బైబిల్ కాలేజీలో క్రమబద్ధ వేదాంతశాస్త్రం (Systematic Theology) ఆచార్యులుగా సేవలందిస్తున్నారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. వాటిలో, 'ది లార్డ్స్ సప్పర్: ఆన్సర్స్ టు కామన్ క్వశ్చన్స్' (The Lord’s Supper: Answers to Common Questions) అనే పుస్తకం కూడా ఉంది.