
ఆరోహణ కీర్తనలను ఎలా చదవాలి
16/07/2026
అతి పరిశుద్ధ స్థలం
23/07/2026కార్యాల నిబంధన అంటే ఏమిటి?
‘కార్యాల నిబంధన’, దీనినే కొన్నిసార్లు ‘సృష్టి నిబంధన’ లేదా ‘జీవ నిబంధన’ అనే దాని, ప్రకారం, దేవుడు ఆదాము మరియు హవ్వలను ‘మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము’ యొక్క పండును తినకుండా నిషేధించాడు (ఆదికాండము 2:15–17). ఈ నిబంధనకు పరిపూర్ణంగా విధేయత చూపినట్లయితే, ఆదాము మరియు హవ్వలు జీవంలో స్థిరపరచబడేవారు; వారు ప్రభువు దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడి, నిత్యజీవాన్ని పొందేలా ఉండేవారు.
ఆదాముతో కుదుర్చుకున్న నిబంధనను మనం ‘కార్యాల నిబంధన’ అని పిలుస్తాము, ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని పొందేందుకు మానవ ప్రయత్నమే సాధనంగా ఉండేది. ఫలించి అభివృద్ధి చెందడం, భూమిపై ఆధిపత్యం వహించడం మరియు నిషేధించిన వృక్షం జోలికి వెళ్ళకుండా ఉండటం వంటి విధేయతతో కూడిన సత్క్రియలు ఆదాముకు మరియు అతని సంతానానికి నిత్యజీవాన్ని అర్హతగా చేకూర్చిపెట్టేవి (ఆదికాండము 1:28; 2:15–17).
మనకు తెలిసినట్లుగా, ఆదాము మరియు హవ్వ ‘కార్యాల నిబంధన’ను అతిక్రమించారు; దీనివల్ల వారు, – యేసు తపిస్తే – వారి సంతతి వారందరూ పాపంలో కూరుకుపోయారు. ఆదాములో, ఆ నిబంధనను పాటించే సామర్థ్యాన్ని మనం కోల్పోయాము (రోమీయులకు 3:9–20); అయితే, ఆ నిబంధన రద్దయిపోయిందని దీని అర్థం కాదు. ఆ నిబంధన షరతులకు మనం ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము, కానీ మన అసమర్థత దృష్ట్యా, మన తరఫున మరొకరు దానిని పాటించడమే మనకున్న ఏకైక నిరీక్షణ (గలతీయులకు 3:10–14).
తన ప్రజల కోసం పరదైసును తిరిగి పొందేందుకు, యేసు రెండవ ఆదాముగా మారాల్సి వచ్చింది. అంటే, మన ప్రతినిధిగా ఆదాము విఫలమైన చోట తాను విజయం సాధించడానికి మరియు దేవునికి పరిపూర్ణంగా విధేయత చూపడానికి, ఆయన మన పోలికలో రావాల్సి వచ్చింది. అపొస్తలుడైన పౌలు దీనిని స్పష్టంగా బోధించాడు (1 కొరింథీయులకు 15:45), కానీ సమాంతర సువార్తలలో ఉన్న యేసు శోధన వృత్తాంతాలలో కూడా ఈ విషయం అంతర్లీనంగా కనిపిస్తుంది.
ఆయన బాప్తిస్మం పొందిన తరువాత, యేసు అరణ్యములోనికి తీసుకెళ్ళబడ్డాడు, అక్కడ ఆదామును శోధించడానికి సర్పమును ఉపయోగించిన వానిని ఆయన ఎదుర్కొన్నాడు. మొదటి ఆదాము, ప్రభువు బయలుపరచిన చిత్తము మీద ఆధారపడకుండా, తన సొంత జ్ఞానము మీద ఆధారపడటానికి శోధించబడ్డాడు. అదేవిధంగా, రెండవ ఆదాము కూడా, దేవుని చిత్తాన్ని—అంటే శ్రమల ద్వారా సర్పమును లోబరచుకొనుటను—విడిచిపెట్టడానికి శోధించబడ్డాడు. ఎందుకంటే, సాతాను తప్పుడు సమయంలో తన అవసరాలను తీర్చమని లేదా వెంటనే, నొప్పి లేకుండా తన పరిపాలనలోకి ప్రవేశించమని యేసును ప్రేరేపించడానికి ప్రయత్నించాడు (మత్తయి 4:1–11). అయితే, మొదటి ఆదాము వలె కాకుండా, యేసు సాతాను శోధనను జయించి, సిలువపై అతని అంతిమ ఓటమికి మార్గం సుగమం చేశాడు (కొలొస్సయులు 2:13–15).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


