
హోషేయ గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
05/08/2025
దానియేలు గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
12/08/2025యెహెజ్కేలు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
యెహెజ్కేలు గ్రంథం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. దేవుని ప్రజలు ఒకవైపు బబిలోన్లో చెరసాలలో ఉన్నవారుగా, మరొకవైపు యెరూషలేములో ముట్టడిలో చిక్కుకున్నవారుగా చీలిపోయారు. యాజక వంశానికి చెందిన ప్రవక్త యెహెజ్కేలు, తన భార్య మరణించినా సంతాపం తెలపకుండా 390 రోజులు ఎడమ వైపున పడుకోవలసి వచ్చింది. ఈ గ్రంథం లోని దృశ్యాలు గూఢార్థకమైన చిహ్నాలతో, కలవరపెట్టే ప్రవచన వాక్యాలతో ముడిపడి ఉన్నాయి(యెహెజ్కేలు 4:4–8; 24:15–24). యెహెజ్కేలు గ్రంథంలో దేవుని స్వభావాన్ని గురించి అత్యంత లోతైన ఉద్రిక్తతలు కనిపిస్తాయి. ఆయన సృష్టికి అతీతుడై సర్వలోకానికి పైవాడైనప్పటికీ, తన ప్రజల మధ్య నివసించే దేవుడు. ఆయన సంపూర్ణ పరిశుద్ధత కలవాడు పాపాన్ని అసహ్యించుకునేవాడు కానీ ఎప్పుడూ క్షమించేందుకు సిద్ధంగా ఉంటాడు. తీర్పులో ఆయన భయంకరంగా ప్రత్యక్షమవుతాడు, అయితే తన కృపలో మాత్రం అద్భుతమైన ప్రేమ, అపూర్వమైన దయ కనిపిస్తుంది. ఈ ఉద్రిక్తతలు పాఠకునికి కలవరం లేదా అయోమయం కలిగించగలవే అయినా, యెహెజ్కేలు గ్రంథం యెహోవా నామమును మరియు ఆయన మహిమను ప్రత్యేకమైన, బోధనాత్మకమైన రీతిలో తెలియజేస్తుంది.
ఈ మూడు విషయాలు యెహెజ్కేలు ప్రవచనాలలో ఉన్న ఉద్రిక్తతను అర్థం చేసుకోవడంలో, అలాగే ఆ ప్రవచనాల్లో ఉన్న మహిమను ఆస్వాదించడంలో మీకు సహాయపడతాయి.
1. యెహెజ్కేలు చూపిన విచిత్ర దర్శనాలు, ప్రవచనాలు ఘనమైనవైనప్పటికీ అవి మనకు గ్రహించగలిగే దేవుడిని వెల్లడిస్తాయి.
దిగ్భ్రాంతిని అనుభవించడానికి మీరు యెహెజ్కేలు గ్రంథాన్ని ఎక్కువ దూరం చదవాల్సిన అవసరం లేదు. అతని ప్రారంభ దర్శనం మరియు దైవపిలుపులోనే భయంకరమైన లక్షణాలతో కూడిన నాలుగు జీవులు (తరువాత కెరూబులుగా గుర్తించబడ్డాయి), సామాన్య మానవ ఇంద్రియాలను సైతం కదిలించే “యెహోవా మహిమ యొక్క ఆకృతి” అనే దివ్య దర్శనం, మరియు ఆయన ఆజ్ఞతో కూడిన కార్యకలాపాల శ్రేణి ఉన్నాయి. వీటిలో ఒక గ్రంథపు చుట్టను తినడం, మౌనంగా ఉండటం వంటివి కూడా ఉన్నాయి (యెహెజ్కేలు 1:1–3:27; 10:20). ఇది కేవలం గ్రంథానికి ఆరంభం మాత్రమే. యెహోవా మహిమతో కూడిన దర్శనాలు, ఆయన దేవదూతల సమూహం యొక్క గుర్తుల రూపంలో ఉన్న దర్శనాలు, చిత్రాలు, మరియు దైవిక ప్రకటనలు గ్రంథం మొత్తం పునరావృతమవుతాయి (యెహెజ్కేలు 10:1–22; 40:1–4 చూడండి).
కానీ ఇది గుర్తుంచుకోండి: మీరు ఆశ్చర్యంతో స్పందించాల్సిందే. సృష్టికి అతీతమైన దేవుని మహిమను ఎదుర్కోవడం ఆశ్చర్యం మరియు వినయంతో కూడిన ప్రతిస్పందనను కోరుకుంటుంది. ఆ మహిమను చూసినప్పుడు యెహెజ్కేలు సాష్టాంగ నమస్కారం చేస్తాడు (యెహెజ్కేలు 1:28). పవిత్రాత్మతో నిండిన అతని పరిచర్యను ఇలా నమోదు చేయబడిన ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి మనలో కూడా అదే భక్తితో కూడిన భయం, వినయంతో కూడిన ప్రతిస్పందనను కలిగించడమే.
యెహెజ్కేలు వంటి మానవులు, బాబిలోనియన్ చెరలో ఉన్నవారు, మరియు మనలాగే మన స్వంత నిబంధనల ప్రకారం దేవుణ్ణి తెలుసుకోలేరు: ఆయన తనను తాను తెలియజేసుకోవాలి. అయినప్పటికీ, ఒక విషయాన్ని మర్చిపోకండి, మన సార్వభౌమ దేవుడు అంతర్లీనంగా ఉన్నాడని మరియు ప్రపంచవ్యాప్తంగా తనను తాను తెలియజేసుకుంటాడని యెహెజ్కేలు వెల్లడిస్తాడు, ఎందుకంటే “నేను ప్రభువునని మీరు తెలుసుకుంటారు” అనే పదబంధం ఇశ్రాయేలు మరియు దేశాలకు ప్రవచనాలలో కనిపిస్తుంది (యెహెజ్కేలు 7:4, 9; 11:10; 13:9, మొదలైనవి).
యెహెజ్కేలు వంటి మానవులు, బబులోను చెరలో ఉన్నవారు, మరియు మనలాగే మన స్వంత ప్రమాణాల ప్రకారం దేవుడిని తెలుసుకోలేరు. ఆయన తానే తనను తెలియపరచుకోవాలి. అయినప్పటికీ, ఒక విషయం మాత్రం స్పష్టం: మన సార్వభౌముడైన దేవుడు మన మధ్య నివసించేవాడని, మరియు ప్రపంచవ్యాప్తంగా తనను తాను తెలియజేసుకుంటాడని యెహెజ్కేలు వెల్లడించాడు. ఎందుకంటే “నేను యెహోవానై యున్నానని నీ వెరుగునట్లు” అనే వాక్యం ఇశ్రాయేలుకే కాకుండా అన్యదేశాలకు చెప్పబడిన ప్రవచనాలలో కూడా పదే పదే కనిపిస్తుంది (యెహెజ్కేలు 7:4, 9; 11:10; 13:9, మొదలైనవి).
విచారకరంగా, మానవ పాపం మరియు దైవభ్రష్టత్వం కారణంగా, పరిశుద్ధుడైన దేవుడు మొదట తనను తీర్పు ద్వారానే వెల్లడించుకోవాల్సి వస్తుంది. ఇది మన తదుపరి అంశానికి దారి తీస్తుంది.
2. యెహెజ్కేలు యాజక వంశావళి దేవుని పవిత్రతను నొక్కి చెబుతుంది.
యెహెజ్కేలు గ్రంథ ఆరంభంలోనే తాను యాజక వంశానికి చెందినవాడినని చెప్పుకుంటాడు, కానీ యెరూషలేములో యాజకుడిగా సేవ చేసే అవకాశం అతనికి లభించినట్టు కనిపించదు (యెహెజ్కేలు 1:3). బదులుగా ప్రభువు అతనిని తన ప్రవక్తగా సేవ చేయడానికి పిలుస్తాడు; మొదట తన స్వంత తిరుగుబాటుదారులైన ప్రజలపై తీర్పు వాగ్దానాలను ప్రకటించేందుకు, ఆ తర్వాత దుష్టమైన దేశాలపై తీర్పు వెలుపరచేందుకు (యెహెజ్కేలు 1:1–24:27; 25:1–32:32). ఈ వృత్తి మార్పు ఉన్నప్పటికీ, యెహెజ్కేలు తన యాజక పరిజ్ఞానాన్ని ముఖ్యంగా తీర్పులో దేవుని పవిత్రతను చూపించే సందర్భాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
పవిత్రాత్మతో నిండి, న్యాయవాది వలె వ్యవహరిస్తున్న యెహెజ్కేలు, పాత ఒడంబడికలోని దేవుని ప్రజలు ఆయన నిబంధనలను ఎలా ఉల్లంఘించారో, మరియు విగ్రహారాధన ద్వారా తమను తాము ఎలా అపవిత్రం చేసుకున్నారో బహిరంగంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రకటించడంలో వెనుకాడడు (యెహెజ్కేలు 5:6; 16:59). ఈ చర్యల కారణంగా, ప్రభువు నామమే “అపవిత్రం” అయ్యే ప్రమాదం ఏర్పడింది. అందువల్ల, తన నామ పవిత్రతను కాపాడేందుకు, దేవుడు తన మహిమయుక్త ఉనికిని (తన పరలోకపు, మోసుకెళ్ళే సింహాసనం ద్వారా సూచించబడినది) యెరూషలేము నుండి తొలగించాడు. అంతేకాకుండా, ఆ పట్టణానికి విధినిశ్చయమైన నాశనదినాన్ని నియమించాడు (యెహెజ్కేలు 20:9, 14). యెహెజ్కేలు ఇశ్రాయేలు తిరుగుబాటు ఎంత ఘోరమైనదో వివిధ సాహిత్య చిత్రణల ద్వారా చూపిస్తాడు. వాటిలో బహుశా, ఇద్దరు విశ్వాసఘాతుక సోదరీమణుల ఉపమానం కంటే ఎక్కువగా కలవరపెట్టేది మరొకటి ఉండదు (యెహెజ్కేలు 23:1–49). యెరూషలేము పతనంపై ఇతర దేశాలు ఆనందించి, తాము అభేద్యులమని భావించకుండా ఉండేందుకు, యెహెజ్కేలు ప్రపంచంలోని అన్ని దేశాలకు ప్రతీకగా ఉన్న చుట్టుపక్కల ఏడు రాజ్యాలపై కూడా తీర్పు వాక్యాలను ప్రకటిస్తాడు. వారు చేసిన దుష్టత్వానికి, పరిశుద్ధుడైన దేవునికి విరుద్ధంగా చేసిన తిరుగుబాటుకు వారు కూడా జవాబుదారులు అవుతారు మరియు వారిపై వచ్చే తీర్పు ద్వారా ప్రపంచం ఆయన మహిమను తెలుసుకుంటుంది.
కానీ ఇశ్రాయేలు నిరాశ పడకుండా, పునరుద్ధరణపై ఆశలు నిలబెట్టుకునేలా, యెహెజ్కేలు మరో యాజక సంబంధ భావనైన ఆలయాన్ని ఆశకు కేంద్రబిందువుగా పరిచయం చేస్తాడు.
3. యెహెజ్కేలు ప్రకటించిన పునరుద్ధరణ ప్రవచనాలను యేసు దేవుని ఆలయంగా నెరవేర్చాడు.
తీర్పు మధ్యలో కూడా, మహిమగల, పరిశుద్ధుడైన ఇశ్రాయేలు దేవుడు పునరుద్ధరణను ప్రవచించాడు. యెహెజ్కేలు ఎండిన ఎముకలు తిరిగి జీవం పొంది బ్రతికించబడడాన్ని చూసినట్లే, దేవుడు తన నిబంధన ప్రజలను కూడా నిశ్చయంగా పునరుత్థానం చేస్తాడు (యెహెజ్కేలు 37:1–14). అయితే యెహోవా తన ప్రజలను తీర్పుకు ముందు ఉన్న స్థితికి మాత్రమే పునరుద్ధరించడు. ఆయన వారిని శుద్ధిచేసి, కొత్త హృదయాన్ని అందించి, వారిని వారి పూర్వీకుల రాజ్యంలో తిరిగి స్థాపించి, వారి మీద ధర్మమయుడైన దావీదు సంతతికి చెందిన అధిపతిని నియమించి, యుగయుగాల పాటు వారి మధ్య నివసిస్తాడు (యెహెజ్కేలు 36:22–37:28). యెహెజ్కేలు ఈ మారిన, నిబంధన ఆధారిత శాంతి స్థితిని తన కొత్త ఆలయ దర్శనం ద్వారా ముందుగా ఊహించుకుంటాడు. ఈ ఆలయం ప్రభువు యొక్క నిత్య ఉనికిని సూచిస్తుంది. “ప్రభువు అక్కడ ఉన్నాడు” అనే నగర పేరు ద్వారా ఇది మరింత స్పష్టమవుతుంది (యెహెజ్కేలు 40–48 అధ్యాయాలు చూడండి).
యెహెజ్కేలు ప్రవచించిన నెరవేర్పు రెండవ ఆలయ పునర్నిర్మాణంతో పరిమితం కాలేదు; అది యేసులో పరిపూర్ణతను చేరుకుంది. అపొస్తలుడైన యోహాను దైవప్రేరిత రచనలు దీనికి సాక్ష్యంగా నిలుస్తాయి. దేవుని మహిమ యొక్క సంపూర్ణత దేవుని కుమారుడైన యేసులో వ్యక్తమైంది; ఆయన తన ప్రజల మధ్య నివసించి, దేవుణ్ణి తెలిసికొనగలిగేలా చేశాడు (యోహాను 1:14–18). యేసు తనను తాను ఆలయంగా ప్రకటించాడు; దాని విధ్వంసం తెచ్చే ఆత్మవేదనను తన సిలువ మరణంతో పోల్చాడు, మరియు దాని పునరుద్ధరణ మహిమను తన పునరుత్థానంతో పోల్చాడు (యోహాను 2:18–22). అంతేకాదు, యెహెజ్కేలు ఆలయం నుండి ప్రవహించే నది లోకమంతటికీ జీవాన్ని ఇస్తుందని దర్శించినట్లే, యేసు తనను తానే జీవజలాలకు మూలంగా ప్రకటించుకున్నాడు (యోహాను 4:1–43; 7:37–39). తన తుది దర్శనంలో, అపొస్తలుడైన యోహాను దేవుని మరియు గొర్రెపిల్ల సింహాసనం నుండి ప్రవహించే ఈ నదిని చూశాడు. అది దేశాలలో చెల్లాచెదురుగా ఉన్న ఆయన ప్రజలకు శుద్ధిని, స్వస్థతను తీసుకొచ్చింది (ప్రకటన 22).
యెహెజ్కేలు గ్రంథంలో కనిపించిన తీవ్ర ఉద్రిక్తత , ఇప్పుడు ఊహించదగిన గొప్ప శక్తిగా మారింది, అదే దేవుడి మరియు గొర్రెపిల్లయైన క్రీస్తు యొక్క శాశ్వత సన్నిధి.
ఈ వ్యాసం “బైబిల్లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్లో ప్రచురించబడింది.


